సమన్వయంతో.. కరోనా మహమ్మారికి కట్టడి: జిల్లా ఎస్పీ

జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడానికి ప్రతి ఒక్కరి కృషి, సహకారంతోనే సాధ్యమైందని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ పేర్కొన్నారు.



మంగళవారం శిక్షణ యువ ఐపీఎస్ అధికారి హర్షవర్ధన్ శ్రీవాత్సవతో కలిసి పట్టణంలో విస్తృతంగా పర్యటించారు, పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్ల వద్ద, పోలీస్ బందోబస్తు పై ఆరా తీస్తూ, దిశా నిర్దేశం చేశారు, ముఖ్యంగా కంటైన్ మెంట్ ప్రాంతాల్లో బందోబస్తు పకడ్బందీగా ఉండాలని సూచించారు, ఈ నేపథ్యంలో రామ్ లీలా మైదానంలో తాత్కాలికంగా హోల్ సేల్ కూరగాయల మార్కెట్ ఏర్పాట్లను పరిశీలించారు, ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణకు వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి సమన్వయంతో పని చేస్తున్నామని తెలిపారు,లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు, రేయింబవళ్ళు కట్టుదిట్టమైన చర్యలతోనే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని తెలిపారు, కంటైన్ మెంట్ ప్రాంతాల్లోని ఇళ్ల నుంచి ఎవరినీ బయటకు రానివ్వడం లేదని తెలిపారు, సడలింపు సమయంలో నిత్యావసరాలు కొనుగోలుకు వచ్చిన ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు, అనుమతులు ఇచ్చిన దుకాణాలు మాత్రమే తెరిచి ఉంచాలని తెలిపారు,300 నిఘా కెమెరాల నీడలో లాక్ డౌన్ నిబంధనలను పగడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు, నిబంధనలు ఎవరు ఉల్లంఘించిన కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు, కంటైన్ మెంట్ ప్రాంత దారులన్నీ బారికేడ్లతో మూసేసి అకారణంగా తిరిగే వారి వాహనాలను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు, ఈ క్రమంలోనే 331 కేసులు నమోదు చేసి 1324 మందిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు, ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య, పురపాలక, రెవెన్యూ తదితర శాఖలతో కలిసి చేపట్టాల్సిన చర్యలపై పోలీస్ అధికారులకు సూచించారు, ఈ సమీక్షలో శిక్షణ యువ ఐపీఎస్ అధికారి హర్షవర్ధన్ శ్రీవాత్సవ, పట్టణ డిఎస్పి వెంకటేశ్వరరావు, పట్టణ సీఐ వి. సురేష్, పి సి ఆర్ ఇన్స్పెక్టర్ మల్లేష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సిహెచ్ సుబ్బారావు, ఎస్సై అన్వర్ ఉల్ హక్, ఒకటో పట్టణ ఎస్ఐ జాదవ్ గుణవంత రావు తదితరులు పాల్గొన్నారు.


Comments
Popular posts